Header Banner

టీకాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుకు షోకాజ్ నోటీసులు...! కారణం ఇదే!

  Wed May 21, 2025 18:12        Politics

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు పార్టీ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు, గాంధీ భవన్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమాలపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించిన కారణంగా సునీతా రావుకు జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఈ నోటీసులు పంపినట్లు సమాచారం. పార్టీలో ఏవైనా సమస్యలుంటే అంతర్గత వేదికలపై చర్చించాలని, బహిరంగంగా ఆరోపణలు చేయడం, నిరసనలకు దిగడం సరికాదని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నోటీసులో, సునీతా రావు తన వైఖరిపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిర్దేశిత గడువులోగా సమాధానం రాకపోతే, కాంగ్రెస్ పార్టీ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించినట్లు సమాచారం.

కొద్ది రోజుల క్రితం సునీతా రావు, గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ఎదుట కొందరు మహిళా నాయకులతో కలిసి ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలకు నామినేటెడ్ పదవుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని, వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం, కార్పొరేషన్ పదవుల్లోనూ మహిళలకు తగిన వాటా దక్కడం లేదని, పార్టీ నాయకత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ముఖ్యంగా, మహేష్ గౌడ్ తన బంధువులకే పదవులు కట్టబెడుతున్నారంటూ ఆమె చేసిన ఆరోపణలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి.

అధికార పార్టీలో ఉంటూ, పార్టీ కార్యాలయంలోనే టీపీసీసీ అధ్యక్షుడిపై ఆరోపణలు చేస్తూ నిరసనకు దిగడాన్ని జాతీయ మహిళా కాంగ్రెస్ నాయకత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సునీతా రావుకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కోరినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఇది కూడా చదవండి: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ఇకపై నో టెన్షన్..! విమానాల తరహాలో బస్సుల్లో కూడా..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

ఎవ్వరూ మాట్లాడొద్దు..! లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TelanganaCongress #ShowCauseNotice #CongressControversy #PoliticalNews #WomenLeadership